Sree SatyaSai District: కదిరి వైసీపీలో బయటపడిన వర్గపోరు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి వైసీపీలో వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్కు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశాలతో కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ మార్పు కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుకూల వర్గ కౌన్సిలర్లు మున్నార్కు విహారయాత్ర కోసం నాలుగు కార్లలో బయలుదేరి వెళ్లారు.
ఎమ్మెల్యేకి ఇన్ని రోజులు అనుకూలంగా ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ పర్వీన్ మున్నిసా కుటుంబం 2024 ఎలక్షన్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల కదిరికి చెందిన పారిశ్రామికవేత్త మబ్బులు బాషా తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో, ఆయనకు వైసీపీ టికెట్ అంటూ కదిరి పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి తోడు, కదిరి టికెట్ వైసీపీ టికెట్ ఆశిస్తున్న మబ్బులు బాషాకు మున్సిపల్ చైర్ పర్సన్ కుటుంబం మద్దతు తెలిపింది. అది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రతీకార చర్యగా మున్సిపల్ చైన్ పర్సన్ మార్పుకు స్కెచ్ వేశారని చర్చజరుగుతోంది.
ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గంలోని కొందరు కౌన్సిలర్లు నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా మరోసారి మైనార్టీ మహిళనే ఎన్నుకోవాలని కోరుతుండగా, ఐదవ వార్డ్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ రెడ్డి భార్య మున్సిపల్ చైర్ పర్సన్ గా చేయాలని మరికొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Tags
- internal conflicts in ycp
- internal conflicts
- internal conflicts in kavali
- internal conflicts in ycp leaders
- internal conflicts in ycp politics
- ycp internal conflicts
- internal conflicts in tdp
- tdp internal conflicts
- internal party conflicts
- splits of internal conflicts
- why internal conflicts arise
- internal conflict
- internal conflicts between
- internal conflicts arise among tdp leaders
- internal conflicts in atmakur
- internal conflicts in atmakur tdp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com