బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ పూర్తి ఫోకస్‌ చేసింది. హస్తిన కేంద్రంగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు.. GHMC ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రచార సభలు.. అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు త్వరలో తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికపైనే ప్రధానంగా భేటీ జరగనున్నట్టు సమాచారం. స్థానిక బీజేపీ నేతలు తమ పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని.. దుబ్బాకలో వచ్చిన ఫలితాన్ని ఏపీలో కూడా వచ్చేలా చేస్తామని అధిష్టానానికి చెబుతున్నారు.. అటు జనసేన నాయకులు సైతం తిరుపతి ఎంపీ సీటు తమకు కేటాయిస్తే కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో జనసేనకు భారీగా కార్యకర్తల మద్దతు ఉందని.. ఎట్టిపరిస్థితుల్లో సీటు వదులుకోకూడదని జనసేన భావిస్తోంది. ఈ ఉత్కంఠకు జేపీ నడ్డా-పవన్‌లు తెరదించే అవకాశం ఉంది.


Tags

Read MoreRead Less
Next Story