Kadapa: కడపలో వైసీపీ నేతలపై రైతుల దాడి
By - Subba Reddy |9 March 2023 6:15 AM GMT
వడ్డెర కులస్తులు సాగు చేసుకుంటున్న పొలాల్లోకి వెళ్లి.. వైసీపీ నాయకులు దౌర్జన్యం
కడప జిల్లాలో వైసీపీ నేతలపై రైతులు దాడి చేశారు. దీంతో బి.మఠం మండలం గుండాపురంలో ఆక్రమిత ప్రభుత్వ భూముల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వడ్డెర కులస్తులు సాగు చేసుకుంటున్న పొలాల్లోకి వెళ్లి.. వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. ఆగ్రహించిన రైతులు.. వైసీపీ నేతలపై కారం చల్లి.. తరిమికొట్టారు. ఈ దాడిలో వైసీపీ నేతలు వెంకట్రామ్ రెడ్డి, రమణారెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com