రాముడి శిరస్సు తొలగించిన నేత అభినవ రాముడు ఎలా అవుతాడు? కాల్వ శ్రీనివాసులు

X
By - TV5 Digital Team |9 Jan 2021 6:58 PM IST
రామతీర్థం ఘటనను ఇతర మతస్తులు కూడా హర్షించరని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
రామతీర్థం ఘటనను ఇతర మతస్తులు కూడా హర్షించరని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలో ఆలయాల నిర్మాణానికి ఎక్కడ స్థలం కేటాయించారో చెప్పకుండా.. తూతూమంత్రంగా భూమి పూజలు చేయడాన్ని సీఎం జగన్ చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయిందన్నారు. రాముడి శిరస్సు తొలగించిన నేత అభినవ రాముడు ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు అధికారులు, ఉద్యోగులు పనిచేయడం ఏంటని కాల్వ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com