కులాల మధ్య వైసీపీ ఎమ్మెల్యే చిచ్చు

కులాల మధ్య వైసీపీ ఎమ్మెల్యే చిచ్చు
X


కావలి ఎమ్మెల్యే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి అనాలోచిత హామీ ఏపీని మరో మణిపుర్‌ చేసేలా ఉందని ఫైర్‌ అవుతున్నారు.గత ఎన్నికల ప్రచారంలో భాగంగా శంభుని రెడ్లను ఎస్సీలో చేర్పిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శంభునిరెడ్ల కులస్తులు వారి వాగ్దానాన్ని గుర్తు చేశారు.శంభుని రెడ్ల కులస్తును ఎస్సీ కేటగిరీలో చేర్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్సీలో కలిపేందుకు న్యాయం చేస్తానని మీడియా ముఖంగా అనడంతో సమస్య మొదలైంది. శంభుని రెడ్లను దళితుల జాబితాలో చేర్చుతానంటూ హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

రాజకీయ లబ్ధి కోసమే అవగాహన లేని హామీలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇస్తున్నాడంటూ ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు చేయటం ఎమ్మెల్యేకి తగదని దళిత సంఘాలు కావలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశాయి.ఎమ్మెల్యే హామీ ఇచ్చిన.. దళితులు తమ లబ్దిని అడ్డుకుంటున్నారంటూ శంభునిరెడ్లు ఆగ్రహంగా ఉన్నారు. అటు శంభుని రెడ్లు..ఇటు దళితుల మధ్య ఏప్పుడు ఏం జరుగుతుందో అంటూ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చట్టాలపై అవగాహన లేకుండా ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో పార్టీకి నష్టం వాటిలే పరిస్థితి ఉందంటూ వైసీపీ నాయకులే అంటున్నారు.

Tags

Next Story