Kondareddy Buruju : త్రివర్ణంలో వెలిగిపోతున్న కొండారెడ్డి బురుజు..
By - Divya Reddy |5 Aug 2022 4:10 AM GMT
Kondareddy Buruju : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కర్నూలు జిల్లాలో త్రివర్ణ శోభితం సంతరించుకుంది.
Kondareddy Buruju : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కర్నూలు జిల్లాలో త్రివర్ణ శోభితం సంతరించుకుంది. పౌరుషాల కోట కొండారెడ్డి బురుజు త్రివర్ణ విద్యుత్ దీపాల వెలుగులో ఆకట్టుకుంటోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు కోటలకు జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. దీంతో చారిత్రక కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజలు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com