Kurnool : గుడి స్థలంలో ఇళ్ల నిర్మాణం... ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు

X
By - Vijayanand |11 April 2023 3:30 PM IST
ఇరు వర్గాల పరస్పర దాడులతో గ్రామంలో భయానక పరిస్ధితులు నెలకొన్నాయి.
కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మారెమ్మ గుడి స్థలం కోసం బీసీ, ఎస్సీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలకు చెందిన వారు కట్టెలు,రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఎస్సీలకు చెందిన మారెమ్మగుడికి చెందిన స్థలంలో కొందరు ఇళ్లు కట్టుకోవడంతో వివాదం చెలరేగింది. మా గుడి స్థలంలో మీరెందుకు ఇల్లు కట్టుకున్నారంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రశ్నించగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు వారిపై కర్రలతో దాడికి దిగారు. ఇరు వర్గాల పరస్పర దాడులతో గ్రామంలో భయానక పరిస్ధితులు నెలకొన్నాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com