బ్రేకింగ్.. విజయవాడ దుర్గ గుడి సమీపంలో విరిగిపడ్డ భారీ కొండచరియలు

X
విజయవాడ దుర్గ గుడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. పలువురు భక్తులు గాయపడ్డారు. ఐతే.. కొండచరియల కింద భక్తులున్నారో..లేదో ఆలయ అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇటీవల వర్షాలకు తరచూ కొండచరియలు విరిగిపడుతుండడం.. భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. మౌన స్వామి ఆలయం వద్ద ఉన్న కొండకు పగుళ్లు పట్టడంతో చిన్నచిన్న రాళ్ళు విరిగిపడుతున్నాయి. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని వర్షం పడినప్పుడు చిన్న చిన్న రాళ్ళు విరిగిపడడం సహజమే అంటున్నారు దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
