తిరుమలలో చిరుత సంచారం
చిరుత సంచారం కలకలం.. విఐపిలు తిరిగే ప్రాంతం కావడంతో చిరుత సంచారం ఆందోళన కల్గిస్తోంది.

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అర్దరాత్రి ఎస్. వి మ్యూజియం ప్రవేశ మార్గం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక్కడ ఎక్కువ శాతం విఐపిలు తిరిగే ప్రాంతం కావడంతో చిరుత సంచారం ఆందోళన కల్గిస్తోంది. సీసీటీవీల్లో చిరుత సంచారం రికార్డుకావడంతో విజిలెన్స్ అధికారులు, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రాత్రిసమయాల్లో అటవీ శాఖ అధికారులు రహదారులను పర్యవేక్షిస్తున్నారు. గత రెండురోజుక్రితం రింగ్ రోడ్డులో ఎలుగుబంటి విజిలెన్స్ సిబ్బంది కంటపడింది. అయితే రాత్రి సమయంలో భక్తులు, స్థానికులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Next Story