LIQUOR CASE: త్వరలో అతిపెద్ద తిమింగలం: కొల్లు రవీంద్ర

లిక్కర్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు

ఎక్సై­జ్ శాఖ మం­త్రి కొ­ల్లు రవీం­ద్ర సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. మద్యం కుం­భ­కో­ణం­లో త్వ­ర­లో అతి పె­ద్ద తి­మిం­గ­లం బయ­ట­కొ­స్తుం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. ప్ర­పం­చం­లో­నే ఇది అతి పె­ద్ద మద్యం కుం­భ­కో­ణ­మ­న్నా­రు. ఓ కా­ర్య­క్ర­మం­లో ఆయన మా­ట్లా­డు­తూ.. ఇప్ప­టి వరకు చి­న్న తి­మిం­గ­లా­లు మా­త్ర­మే బయ­టి­కి వచ్చా­యి.. అన్ని ఆధా­రా­ల­తో త్వ­ర­లో పె­ద్ద తి­మిం­గ­ళం బయట పడు­తుం­ద­న్నా­రు. గతం­లో అడ్డం­గా దో­చు­కు­ని జే­బు­లు నిం­పు­కొ­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. కూ­ట­మి వచ్చాక 500 కో­ట్ల రూ­పా­య­లు అద­నం­గా ఆదా­యం వచ్చిం­ద­న్నా­రు. బయట రా­ష్ట్రాల నుం­చి వచ్చే అక్రమ మద్యా­ని­కి కళ్లెం వే­శా­మ­ని తె­లి­పా­రు. రా­ష్ట్రం­లో తక్కువ దొ­ర­కే నా­ణ్య­మైన మద్యం అం­దు­తుం­ద­న్నా­రు. రా­ష్ట్రం­లో మద్యం­తో పాటు ఇంకా అనేక కుం­భ­కో­ణా­లు బయ­టి­కి వస్తు­న్నా­య­ని చె­ప్పా­రు.

మాస్టర్‌మైండ్‌ జగనే

మాజీ సీఎం జగ­న్‌ లి­క్క­ర్‌ మా­ఫి­యా కోటి కు­టుం­బా­ల­ను నా­శ­నం చే­సిం­ద­ని కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఏపీ వ్య­వ­హా­రాల ఇన్‌­ఛా­ర్జి మా­ణి­కం ఠా­గూ­ర్‌ ఆరో­పిం­చా­రు. ఏపీ­లో మద్యం స్కా­మ్‌­పై మా­ణి­కం ఠా­గూ­ర్‌ ‘ఎక్స్‌’లో పో­స్టు పె­ట్టా­రు. ‘‘నా­సి­ర­కం మద్యం­తో రూ.3,200 కో­ట్లు కొ­ల్ల­గొ­ట్టా­రు. లి­క్క­ర్‌ స్కా­మ్‌­లో మి­థు­న్‌­రె­డ్డి కే­వ­లం పావు మా­త్ర­మే. అసలు మా­స్ట­ర్‌­మైం­డ్‌ జగ­న్‌, భా­ర­తి. లి­క్క­ర్‌ స్కా­మ్‌ సొ­మ్ము­ను ఎన్ని­క­ల్లో ఖర్చు చేసి ఓట్లు కొ­న్నా­రు’’ అని పే­ర్కొ­న్నా­రు. మరో­వై­పు.. మద్యం కుం­భ­కో­ణం వి­ష­యం­లో చట్టం తన పని తాను చే­సు­కుం­టూ వె­ళ్తుం­ద­ని జన­సేన ఎంపీ బా­ల­శౌ­రి అన్నా­రు. పా­ర్ల­మెం­టు సమా­వే­శాల వేళ.. కేం­ద్రం ని­ర్వ­హిం­చిన అఖిల పక్ష సమా­వే­శం­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. వి­భ­జన సమ­స్య­లు, జల జీ­వ­న్ మి­ష­న్, బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు గు­రిం­చి పా­ర్ల­మెం­టు­లో చర్చిం­చా­ల­ని జన­సేన తర­ఫున ప్ర­స్తా­విం­చి­న­ట్లు ఆయన తె­లి­పా­రు.

Tags

Next Story