LOKESH: మరో ఉపాధ్యాయుడిపై లోకేశ్ ప్రశంసలు

LOKESH: మరో ఉపాధ్యాయుడిపై లోకేశ్ ప్రశంసలు
X
షేక్ ఫి­రో­జ్ భాషా అంకితభావంపై లోకేశ్ పొగడ్తలు

పి­డు­గు­రా­ళ్ల మం­డ­లం తు­మ్మ­ల­చె­రు­వు మె­యి­న్ పా­ఠ­శా­ల­లో సె­కం­డ­రీ గ్రే­డ్ టీ­చ­ర్‌­గా పని­చే­స్తు­న్న షేక్ ఫి­రో­జ్ భా­షా­పై మం­త్రి నారా లో­కే­శ్ ప్ర­శం­స­లు కు­రి­పిం­చా­రు. పి­ల్లల తల­రా­త­ను మా­ర్చే వి­ద్య­ను అం­ది­స్తూ, అం­ద­మైన అక్ష­రా­లు పొం­ది­క­గా రా­య­డం నే­ర్పి­స్తు­న్న షేక్ ఫి­రో­జ్ భాషా ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల­కు ఆద­ర్శం­గా ని­లు­స్తు­న్నా­ర­ని శని­వా­రం మం­త్రి లో­కే­శ్ ట్వీ­ట్ చే­శా­రు. అద­న­పు సమయం స్కూ­లు­లో గడు­పు­తూ వి­ద్యా­ర్థు­ల­కు క్లా­సు­లు తీ­సు­కు­నే భాషా కమి­ట్మెం­ట్‌­కి హ్యా­ట్సా­ఫ్‌ అన్నా­రు.

'అనంతపురం నేలకు జీవితాంతం రుణపడి ఉంటా'

తమ జీవితాంతం అనంతపురం జిల్లా నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా ఆయన సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని తెలిపారు. అనంతపురం నేల తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా నిలిచిందని, నందమూరి బాలకృష్ణను మూడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల ఇదని మంత్రి కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

కుప్పంలో 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన!

చి­త్తూ­రు జి­ల్లా­లో­ని కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గం పా­రి­శ్రా­మిక అభి­వృ­ద్ధి­లో కీలక ముం­ద­డు­గు వే­సిం­ది. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు గారు శని­వా­రం ఉం­డ­వ­ల్లి­లో­ని సీఎం క్యాం­ప్ కా­ర్యా­ల­యం నుం­చి వర్చు­వ­ల్ వి­ధా­నం­లో ఒకే­సా­రి 7 పరి­శ్ర­మ­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. సు­మా­రు రూ. 2,203 కో­ట్ల భారీ పె­ట్టు­బ­డి­తో ప్రై­వే­టు సం­స్థ­లు ఏర్పా­టు చే­య­ను­న్న ఈ పరి­శ్ర­మ­ల­కు ప్ర­భు­త్వం అను­మ­తు­లు మం­జూ­రు చే­సిం­ది. ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు స్థా­నిక ప్ర­జ­లు, వి­విధ సం­స్థల ప్ర­తి­ని­ధు­ల­తో ఆన్‌­లై­న్‌­లో మా­ట్లా­డా­రు. ఈ పరి­శ్ర­మ­లు ని­ర్దే­శిం­చిన సమ­యా­ని­కి ప్రా­రం­భ­మై, స్థా­నిక యు­వ­త­కు ఉపా­ధి అవ­కా­శా­లు కల్పిం­చే­లా కృషి చే­యా­ల­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story