LOKESH: "కొత్త ఎమ్మెల్యేలకు మంచిచెడు తెలియట్లేదు"

LOKESH: కొత్త ఎమ్మెల్యేలకు మంచిచెడు తెలియట్లేదు
X
టీడీపీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన నారా లోకేశ్

తొ­లి­సా­రి గె­లి­చిన కొంత మంది ఎమ్మె­ల్యే­ల­కు మంచి చె­డు­లు తె­లి­య­డం లే­ద­ని మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. అవ­గా­హ­నా రా­హి­త్యం, అను­భవ లే­మి­తో సమ­న్వ­యం ఉం­డ­ట్లే­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఉం­డ­వ­ల్లి­లో­ని సీఎం క్యాం­పు కా­ర్యా­ల­యం­లో మం­త్రు­ల­తో ఆయన సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ‘‘సీ­ని­య­ర్ ఎమ్మె­ల్యే­లు, నే­త­ల­తో తొ­లి­సా­రి గె­లి­చిన ఎమ్మె­ల్యే­ల­కు అవ­గా­హన కల్పిం­చా­లి. కొ­త్త ఎమ్మె­ల్యే­లు వరుస వి­జ­యా­లు కొ­న­సా­గిం­చా­లం­టే లో­టు­పా­ట్లు సరి­చే­సు­కో­వా­లి. 14, 15 తే­దీ­ల్లో వి­శా­ఖ­లో జరి­గే పె­ట్టు­బ­డుల భా­గ­స్వా­మ్య సద­స్సు­ను వి­జ­య­వం­తం చే­ద్దాం’’ అని లో­కే­శ్‌ అన్నా­రు. ఈ సద­స్సు ద్వా­రా రా­ష్ట్రా­ని­కి దా­దా­పు రూ.10లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు రా­ను­న్నా­య­ని చె­ప్పా­రు. వీటి ద్వా­రా ప్ర­త్య­క్షం­గా, పరో­క్షం­గా లక్ష­లా­ది మం­ది­కి ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు లభి­స్తా­య­న్నా­రు. ప్ర­తి మం­త్రీ తమ శాఖల పరి­ధి ఒప్పం­దా­ల­కు సం­బం­ధిం­చి బా­ధ్య­త­తో వ్య­వ­హ­రి­ద్దా­మ­ని చె­ప్పా­రు. మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు సమ­న్వ­యం­తో పని­చే­యా­ల­ని నారా లో­కే­శ్ సూ­చిం­చా­రు. కొ­త్త ఎమ్మె­ల్యే­ల­కు అవ­గా­హన కల్పిం­చా­లి.. లై­న్‌­లో పె­ట్టా­ల్సిన బా­ధ్యత మీదే అంటూ లో­కే­శ్ కీలక సూ­చ­న­లు చే­శా­రు.

హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ వ్యవహారంలో నిజాలను బయటపెట్టిందని లోకేశ్ తెలిపారు. "ఇది కల్తీ కాదు.. హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. మన నమ్మకాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం. ఇది భరతమాత ఆత్మపై జరిగిన నేరం" అని ఆయన అభివర్ణించారు. దోషులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్ర­భు­త్వం మరో కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. తి­రు­ప­తి జి­ల్లా­లో­ని రా­య­ల­చె­రు­వు­కు గండి పడిన ఘట­న­లో బా­ధి­తు­ల­కు పరి­హా­రం అం­దిం­చ­నుం­ది. మొ­త్తం 960 కు­టుం­బా­ల­కు పరి­హా­రం అం­దిం­చేం­దు­కు రూ.3.23 కో­ట్లు ని­ధు­లు మం­జూ­రు చే­సిం­ది. రాయల చె­రు­వు­కు గం­డి­ప­డ­టం­తో నష్ట­పో­యిన 960 కు­టుంబా­ల­కు.. కు­టుం­బా­ని­కి మూడు వేల రూ­పా­య­లు చొ­ప్పున ఈ పరి­హా­రం అం­దిం­చ­ను­న్నా­రు. ఈ నగదు సా­యం­తో పా­టు­గా ని­త్యా­వ­సర వస్తు­వు­లు కూడా అం­దిం­చా­ల­ని ప్ర­భు­త్వం అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చిం­ది.

Tags

Next Story