నేడు కర్నూల్‌లోకి లోకేష్‌ పాదయాత్ర

నేడు కర్నూల్‌లోకి లోకేష్‌ పాదయాత్ర
నారా లోకేష్‌ చేపట్టిన యువగళ పాదయాత్ర ఇవాల్టితో.. 69వ రోజుకు చేరింది

నారా లోకేష్‌ చేపట్టిన యువగళ పాదయాత్ర ఇవాల్టితో.. 69వ రోజుకు చేరింది. ఇవాళ తాడిపత్రి నియోజకవర్గంలోని రాయలచెరువునుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు 874 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ఇవాళ కర్నూలు జిల్లాలోకి లోకేష్‌ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనుంది. ఉదయం 9.45 నిమిషాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం డి.రంగాపురం సమీపంలో ప్రవేశపించనుంది యువగళం పాదయాత్ర. లోకేష్‌కు అపూర్వ స్వాగతం పలికేందుకు ..... డోన్‌ టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటలకు నల్లమేకలపల్లె చేరుకోనున్న లోకేష్‌.... వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. స్థానిక ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. భోజన విరామం అనంతరం.. సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. జక్కసాని కుంట్ల, పీఆర్ పల్లె మీదుగా గుడిపాడు వరకు పాదయాత్ర చేయనున్నారు. రాత్రి గుడిపాడులో బస చేస్తారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story