జగన్ను చట్టం ముందు నిలబెడతాం: మద్దిపాటి

X
By - Vijayanand |27 May 2023 3:54 PM IST
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు
గోదావరి తీరం పసుపు పండుగ మహానాడుతో హోరెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. దేవరపల్లి జంక్షన్ నుంచి బయల్దేరిన వంద కార్ల ర్యాలీని మద్దిపాటి వెంకటరాజు జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బారికేడ్లను బద్దలు కొట్టి మహానాడుకు వెళ్లి విజయవంతం చేస్తామని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. జగన్ను చట్టం ముందు నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆరోపించారు. పులివెందులతో సహా 175 స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమంటున్నారు మద్దిపాటి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com