MAHANADU: మహానాడు పనుల్లో పార పట్టిన మంత్రి

కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27నుంచి 29 వరకూ మూడు రోజులపాటు మహానాడు నిర్వహిస్తున్న విషయం విదితమే. తొలి రెండు రోజులు ప్రతినిధుల సభ, మూడోరోజైన ఈనెల 29న ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కడపలో ఏర్పాటు చేయడంతో మరింత ఎక్కువ సంఖ్యలో వెళ్లనున్నారు. మరోవైపు మహానాడు సభ ప్రాంగణం వద్ద ఆసక్తికర సన్నివేశం జరిగింది. సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార పట్టి దగ్గరుండి సభా ప్రాంగణాన్ని చదును చేశారు. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్ని దాదాపు పూర్తి కావొచ్చాయి. మహానాడు సభ మంగళవారం ప్రారంభం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com