మరోసారి రైతులను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బొత్స

X
రాజధాని కోసం 300 రోజులుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆడా మగ, పిల్లా పెద్దా అన్న తేడా లేకుండా... అమరావతి కోసం నినదిస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళనతో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా.. మంత్రుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా రైతులను అవమానించే రీతిలో వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం కేవలం టీడీపీ ప్రేరేపితం అంటూ మాట్లాడారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని కోసం పోరాడుతున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేవలం కొంత మంది టీడీపీ నేతలు తప్ప ఎవరూ ఈ ఉద్యమంపై ఆసక్తి చూపడం లేదంటూ.. రైతులను కించపరిచేలా మాట్లాడారు బొత్స.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
