లోకేష్ను విమర్శించే అర్హత మంత్రి కన్నబాబుకు లేదు : చినరాజప్ప

X
By - kasi |2 Nov 2020 2:29 PM IST
పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 71 శాతం పూర్తి చేశామన్నారు ఆ పార్టీ నేత చిన రాజప్ప. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న తమ నాయకుడు లోకేష్ను విమర్శించే అర్హత మంత్రి కన్నబాబుకు లేదన్నారు చినరాజప్ప.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com