MITHUNREDDY: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

MITHUNREDDY: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
X

వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ ఎంపీ పె­ద్ది­రె­డ్డి మి­థు­న్ రె­డ్డి­కి ఊరట లభిం­చిం­ది. లి­క్క­ర్ కుం­భ­కో­ణం­లో అరె­స్ట­యిన ఆయ­న­కు ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­క­ల్లో ఓటు వే­సేం­దు­కు వీ­లు­గా వి­జ­య­వాడ ఏసీ­బీ కో­ర్టు మధ్యం­తర బె­యి­ల్ మం­జూ­రు చే­సిం­ది.ఈ నెల 11న సా­యం­త్రం 5 గం­ట­ల­లో­పు తి­రి­గి రా­జ­మ­హేం­ద్ర­వ­రం సెం­ట్ర­ల్ జై­ల్లో సరెం­డ­ర్ కా­వా­ల­ని.. రూ.50వేల చొ­ప్పున రెం­డు పూ­చీ­క­త్తు­ల­తో ష్యూ­రి­టీ­ని కో­ర్టు­కు సమ­ర్పిం­చా­ల­ని ఆదే­శిం­చిం­ది. ఇది­లా ఉంటే ఏసీ­బీ కో­ర్టు­లో రె­గ్యు­ల­ర్ బె­యి­ల్‌­పై వి­చా­రణ కొ­న­సా­గు­తోం­ది. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ పేపర్లు తీసుకుని జైల్లో సమర్పిస్తే మిథున్ రెడ్డి విడుదలవుతారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది చూడాలి.. ఒకవేళ ఈరోజు ఈ ప్రక్రియ పూర్తికాకపోతే సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

Tags

Next Story