హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

X
By - Nagesh Swarna |8 Feb 2021 6:49 AM IST
ఇకపై నా సంగతేంటో చూపిస్తా.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని బాలయ్య హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు, అభిమానులతో ఫోన్లో మాట్లాడిన బాలయ్య.. ఇకపై పూర్తి స్తాయి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
ప్రస్తుతం తాను చేస్తున్న బోయపాటి సినిమా తర్వాత రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరినీ కలుస్తానన్నారు. ఇకపై నా సంగతేంటో చూపిస్తా.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని బాలయ్య హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com