పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూ బాలకృష్ణ వార్నింగ్‌

పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూ బాలకృష్ణ వార్నింగ్‌
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులకు భయం, భక్తి లేకుండా పోతోందని మండిపడ్డారు.. చట్టమంటే గౌరవం లేకుండా పోయిందని.. పేకాట ఆడితే తప్పేంటని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు.జాగ్రత్తగా ఉండాలంటూ బాలకృష్ణ తనదైన శైలిలో వైసీపీ నాయకులను హెచ్చరించారు.

ఇక హిందూపురం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బాలయ్య.. కిరికెర పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను పరిశీలించారు. 73 లక్షల ఎకరాల్లో 17 వేల కోట్ల విలువైన పంట నష్టపోతే సర్కారు కేవలం 277 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక.. రైతుల వెన్నెముక విరుస్తున్నారని ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story