మట్టి రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే నిమ్మల

X
By - Bhoopathi |9 Jun 2023 3:30 PM IST
చించినాడ గోదావరి నది పరివాహక ప్రాంతంలో దళితుల భూమి నుంచి తరలిస్తున్న మట్టి లారీలను అడ్డుకున్నారు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు.
పశ్చిమగోదావరి జిల్లా మేడపాడులో ఉద్రిక్తత నెలకొంది. చించినాడ గోదావరి నది పరివాహక ప్రాంతంలో దళితుల భూమి నుంచి తరలిస్తున్న మట్టి లారీలను అడ్డుకున్నారు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు.అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు.ఇటుక బట్టిల దగ్గర దిగుమతి చేస్తున్న ఇసుక లారీని పట్టుకొని ఆందోళనకు దిగారు. మట్టి అక్రమ రవాణను అడ్డుకున్న దళితులపై వైసీపీ దాడి చేయడం దారుణమన్నారు.మట్టిమాఫియాలో భాగస్వాములైన..కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.మట్టిని అమ్ముకునే ప్రసాదరాజు, కవురు శ్రీనివాసుల దగ్గర వాటాలు తీసుకుంటున్న జగన్ సీఎం పదవికి అనర్హుడుని మండిపడ్డారు నిమ్మల.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com