ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ
By - Vijayanand |25 May 2023 11:37 AM GMT
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బేంచ్ లో అవినాష్ రెడ్డి బెయిల్ పై విచారణ జరుగనుంది
ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వేకెషన్ బెంచ్ లో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో కర్నూలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అటు... సీబీఐ అధికారుల బృందం రాత్రే కర్నూలుకు చేరుకుంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం.. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. వారం రోజులుగా... అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో శ్రీలక్ష్మికి చికిత్సలు కొనసాగుతున్నాయి. అటు.. ఆసుపత్రి వద్ద వైసీపీ అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో... ఆసుపత్రిలో ఉండే రోగులతో పాటు... స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com