ఏపీలో హిందూ వ్యతిరేక విధానాలు ప్రోత్సహిస్తున్నట్టుగా జగన్ చర్యలు: జీవీఎల్

హిందువులపై వివక్షపూరిత చర్యలు మానుకోకపోతే ముఖ్యమంత్రి జగన్పై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు ఎంపీ జీవీఎల్. రామతీర్థం వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చర్చిపై నాలుగు రాళ్లు వేస్తేనే 40 మంది హిందువులను అరెస్టు చేశారని, వందల దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈ తరహా దాడులు మరో మతంపై జరిగితే పరిణామాలు మరోలా ఉండేవన్నారు జీవీఎల్. క్రిస్మస్ నాడు పోలీసులే కేక్ కట్ చేసి ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి తల తొలగించడం ప్రపంచవ్యాప్త హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఏపీలో హిందూ వ్యతిరేక విధానాలు ప్రోత్సహిస్తున్నట్టుగా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com