రాష్ట్రంలో డెమొక్రసీ ఉందా? : ఎంపీ రఘురామ కృష్ణరాజు

X
By - kasi |15 Sept 2020 1:04 PM IST
రాష్ట్రంలో డెమొక్రసీ ఉందా అనే అనుమానం ప్రజలకు కల్గుతుందన్నారు ఎంపి రఘురామ కృష్ణరాజు. నిలదీసి అడిగిన ప్రతివారిపై ప్రభుత్వం కేసులు పెట్టి ప్రశ్నించకుండా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఏకంగా డీజీపీని హైకోర్టు నిలదీయడం దేనికి సంకేతమని రాఘురామ అనుమానం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com