ఊహించినట్టే పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు : ఎంపీ రఘురామకృష్ణరాజు
X
By - Nagesh Swarna |25 Jan 2021 6:00 PM IST
కొందరు ఉన్నతాధికారులే సీఎం జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు రఘురామకృష్ణరాజు.
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు ఊహించినట్టే వచ్చిందన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కొందరు ఉన్నతాధికారులే సీఎం జగన్ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తన విధిని నిర్వర్తించాలని కోరారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకుని పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలోని వ్యవహారాలను చక్కబెట్టాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com