నిమ్మకూరులో నందమూరి కుటుంబం పర్యటన

నిమ్మకూరులో నందమూరి కుటుంబం పర్యటన
ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని నిమ్మకూరుకు వెళ్లారు

కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి కుటుంబ సభ్యులు పర్యటించారు. ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని నిమ్మకూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మకూరుకు చంద్రబాబు రానున్నారు. పర్యటనలో భాగంగా నిమ్మకూరులోనే చంద్రబాబు బస చేస్తారు. ఈ నేపథ్యంలోనే నిమ్మకూరుకు నందమూరి కుటుంబ సభ్యులు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story