నంద్యాల ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలి : సోమిరెడ్డి

నంద్యాల ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలి : సోమిరెడ్డి

నంద్యాల ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. పోలీసుల కిరాతకం వల్ల సలాం కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కొందరు పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని.. జగన్ సర్కార్‌లో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో చేరి నిర్వీర్యమయ్యాయన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు. పోలీసుల వేధింపులకు భయపడొద్దని హోంమంత్రి చెబుతున్నారని.. వేధింపులు ఆపుతామని మాత్రం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా పోలీసులపై చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.


Tags

Read MoreRead Less
Next Story