నిందితులకు శిక్షపడకుంటే.. రూ.25 లక్షల చెక్‌ తిరిగిచ్చేస్తాం : టీవీ5తో సలాం కుటుంబ సభ్యులు

నిందితులకు శిక్షపడకుంటే.. రూ.25 లక్షల చెక్‌ తిరిగిచ్చేస్తాం : టీవీ5తో సలాం కుటుంబ సభ్యులు

చేయని తప్పుకి కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. వేధింపులకు గురిచేసిన పోలీసులకు రెండు గంటల్లోనే బెయిల్‌ వచ్చింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విపక్షాలు మండిపడుతున్నారు.. అటు ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? ఆ డబ్బుతో సలాం కుటుంబానికి న్యాయం జరిగినట్లేనా..? అందుకే సలాం కుటుంబం ఆ డబ్బు తమకు అక్కర్లేదంటోంది. నిందితులకు మూడు నెలల్లోగా శిక్ష పడాలని డిమాండ్‌ చేస్తోంది. లేదంటే ఆ చెక్కును ప్రబుత్వానికే ఇచ్చేస్తామని సలాం కుటుంబ సభ్యులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story