ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని మంత్రి జయరామే అంగీకరించారు : నారా లోకేశ్

ఈఎస్ఐ స్కాంలో... టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కక్ష సాధింపులో భాగంగానే ఇరికించారనే మేము మొదట్నుంచి చెబుతూనే ఉన్నామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరామే... ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని అంగీకరించారమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు లోకేష్. బెంజ్ మంత్రి పేకాట మాఫియా, ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టామని ట్వీట్లో తెలిపారు. మరి చర్యలెక్కడ జగన్రెడ్డి గారు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు లోకేష్.
Next Story