Lokesh: పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నది వైసీపీ లక్ష్యం

Lokesh: పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నది వైసీపీ లక్ష్యం

పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నది వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. కోవూరు-కావలి నియోజకవర్గాల పరిధిలోని యానాది సామాజిక వర్గీయులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 50 ఏళ్లు దాటిన యానాది సామాజిక వర్గానికి పెన్షన్‌ ఇచ్చామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిని పట్టించుకోకపోగా.. యానాది కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎస్టీకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి జగన్‌ మోసం చేశారని లోకేష్‌ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే యానాది వర్గాన్ని ఆదుకుంటామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ గురుకుల పాఠశాలలు తిరిగి బలోపేతం చేస్తామన్నారు. పెళ్లి కానుక పథకాన్ని తిరిగి పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. యానాదులకు పక్కా ఇళ్లతో పాటు.. ఐటీడీఏకి ఐఏఎస్‌ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story