Nara Lokesh : అన్నగా అండగా నేనుంటా.. ఇంటర్ విద్యార్థికి లోకేష్ భరోసా..!

X
By - TV5 Digital Team |13 May 2021 3:31 PM IST
కరోనా బారినపడి తండ్రి, తాతని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకి అండగా ఉంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
కరోనా బారినపడి తండ్రి, తాతని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకి అండగా ఉంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ కృష్ణ చదువు కొనసాగించేందుకు సహాయం అందిస్తానని తెలిపారు. అన్నగా అండగా ఉంటాననీ చెప్పారు. ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలంటూ ఇటీవలే సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టాడు లోకేష్ కృష్ణ. కాగా చెరుకూరి లోకేష్ కృష్ణ తాతయ్య మల్లికార్జునరావు మే 7 న, తండ్రి వెంకట సుబ్బారావు మే 9న కోవిడ్కి చిక్సిత పొందుతూ మృతి చెందారు. నాయనమ్మ, అమ్మ, లోకేష్ కృష్ణ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com