సీఎం జగన్ తీరుపై నారా లోకేష్ ఫైర్!

సీఎం జగన్ తీరుపై మరోసారి మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్.. టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నారని ఆరోపించారు. దళిత మహిళ నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఛలో పులివెందుల కార్యక్రమానికి పిలుపు ఇస్తే 20 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళలను కాపాడాలని ఎమ్మెల్సీ బీటెకె రవి నిలదిస్తే.. అతడినే అరెస్ట్ చేయడం దారుణమని లోకేష్ మండిపడ్డారు.
ఛలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొని మహిళల్ని కాపాడమని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.పోలీసులకు,@ysjagan కి టిడిపి నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడం పై లేకపోవడం బాధాకరం(3/3) pic.twitter.com/ys5XNpwHKs
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 3, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com