జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదు : నారా లోకేశ్
By - TV5 Digital Team |9 Jan 2021 2:30 PM GMT
కంపెనీలు అన్నీ జగన్ రెడ్డికి బైబై చెప్పేస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
కంపెనీలు అన్నీ జగన్ రెడ్డికి బైబై చెప్పేస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నేతల విధ్వంసం, బెదిరింపులతో కంపెనీలు భయపడుతున్నాయని చెప్పారు. జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదని, పైగా ఏపీలోని కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని విమర్శించారు. జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేశ్ నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదు పైగా ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారింది.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 9, 2021
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com