క్లెమోర్మైన్కే భయపడని కుటుంబం నాది..నీ కోడిగుడ్డుకు భయపడతానా: లోకేష్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యువనేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఘన స్వాగతమే లభిస్తోంది. మంగళహారతులతో లోకేష్కు మహిళలు స్వాగతం పలుకుతూ.. వైసీపీ పాలనలో వారు పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.
మైదుకూరు బహిరంగ సభలో జగన్ పాలనపై విరుచుకుపడ్డారు లోకేష్. యువగళం పాదయాత్ర దెబ్బకు తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు. క్లెమోర్మైన్కే భయపడని కుటుంబం తనదని.. నీ కోడిగుడ్డుకు భయపడతానా అని గళమెత్తారు. పాదయాత్రను అడ్డుకుంటే దండయాత్రేనని వార్నింగ్ ఇచ్చారు. ప్రొద్దుటూరులో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. కొందరు పోలీసులు వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com