Yuvagalam: 193వ రోజు నారా లోకేష్ పాదయాత్ర

Yuvagalam: 193వ రోజు నారా లోకేష్ పాదయాత్ర
గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర పాదయాత్రలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్‌ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 193వ రోజు అంపాపురం శివారు క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.అంపాపురం స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. 11గంటల రంగన్నగూడెంలో స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత సింగన్న గూడెంలోలో గౌడ సామాజికవర్గీయులతో ముచ్చటిస్తారు.

సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. 4గంటల 15నిమిషాలకు మల్లవల్లిలో రైతులతో సమావేశమవుతారు. 4గంటల 45నిమిషాలకు బీసీ సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. అనంతరం ఆయిల్‌ ఫామ్‌ రైతులతో మాటామంతీ నిర్వహిస్తారు. రాత్రి 7గంటల 15నిమిషాలకు యువగళం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో కి ప్రవేశించనుంది. అక్కడ మీర్జాపురంలో స్థానికులతో స్థానికులతో భేటీ కానునన్నారు యువనేత లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story