Nara Loksh : శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

Nara Loksh : శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గంలోకి పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో విడిది కేంద్రం దద్దరిల్లింది .ఇవాళ 99వ రోజు పాదయాత్ర ఉదయం7 గంటలకు చెంచుకాలనీ క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.లోకేష్‌ బస చేసిన క్యాంప్‌ దగ్గర ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతున్నారు.యువనేతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

నారా లోకేష్ను కలసి తమ కష్టాలను చెప్పుకున్నారు కొత్తరామాపురం గ్రామస్తులు.పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధర పెరగడంతో జీవనం ఇబ్బందిగా మారిందని తెలిపారు.వారి సమస్యలు విన్న లోకేష్ జగన్ పాలనలో విపరీతంగా పన్నుల భారం పెంచారని. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించి ఎక్కువ రోజులు పనులు దొరికేలా చేస్తామని భరోసా ఇచ్చారు లోకేష్‌.

ఇక తెలుగుగంగా ప్రాజెక్టును సందర్శించిన లోకేష్‌ స్కిల్డ్‌ అండ్‌ అన్‌ స్కిల్డ్‌ వర్కర్లతో ప్రత్యేక భేటీ అయ్యారు. మధ్యాహ్నం12 గంటలకి ఫారెస్ట్‌ కార్యాలయం సమీపంలో భోజన విరామం ఇవ్వనున్నారు. ఇక తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫారెస్టు కార్యాలయం వద్ద నుంచి పాదయాత్ర కొనసాగించనున్నారు లోకేష్‌. వెలిగోడు మదీనా మసీదు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఆ తరువాత వెలిగోడు సీపీ నగర్‌ మెయిన్‌రోడ్డులో..బుడగ జంగాలతో లోకేష్ సమావేశం కానున్నారు. వెలిగోడు చర్చి వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీ అయి వారి సమస్య లను తెలుసుకోనున్నారు.బోయ రేవులలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించనున్న లోకేష్‌ అక్కడే విడిది కేంద్రంలో రాత్రికి బస చేయనున్నారు యువనేత.

Tags

Read MoreRead Less
Next Story