సీఎం జగన్ ను 2లక్షల మెజారిటీతో ఓడిస్తా : ఎంపీ రఘురామకృష్ణరాజు
By - kasi |17 Oct 2020 12:06 PM GMT
వైసీపీ సర్కార్పై కొంతకాలంగా విమర్శల బాణం ఎక్కుపెడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు...మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి..
వైసీపీ సర్కార్పై కొంతకాలంగా విమర్శల బాణం ఎక్కుపెడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు...మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధమా అంటూ సీఎం జగన్కు సవాల్ చేశారు. సీఎం జగన్ పోటీ చేసినా.. 2లక్షల మెజారిటీతో ఓడిస్తానని అన్నారు. కొంతకాలంగా ఎంపీ డిస్క్వాలిఫికేషన్పై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు చేయగలింది ఏమీ లేదు. డిస్క్వాలిఫికేషన్ చేస్తే చేసుకోండి అని అన్నారు. రాజధాని రెఫరెండంగా.. ముఖ్యమంత్రి పోటీ చేసినా భారీ మెజారిటితో గెలుస్తానన్నారు. అలాగే పార్లమెంటరీ పార్టీ పదవి పైనా రఘురామ స్పందించారు. తనను ఎవరూ తొలగించలేదని.. పదవీ కాలంమే పూర్తి అయిందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com