ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ
By - Nagesh Swarna |2 Sep 2020 12:46 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపిలో మొత్తం కేసులు సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 10వేల 392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపిలో మొత్తం కేసులు సంఖ్య 4లక్షల 55వేల 531కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 72మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 4వేల 125 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 48వేల 330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. లక్షా 3వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో ఒక్కరోజులోనే అత్యధికంగా 11మంది కోవిడ్ బారిన పడి మృత్యువాతపడ్డారు. చిత్తూరులో 10మంది, పశ్చిమగోదావరిలో 9, ప్రకాశం జిల్లాలో 8మంది మృతిచెందారు. ఇక కృష్ణా, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com