అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు సస్పెండ్

అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు సస్పెండ్

రెండో రోజు ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టిడ్కో ఇళ్లపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. అయితే కీలక బిల్లులున్నాయని.. అధికార పక్షం చెప్పగా... విపక్ష టీడీపీ మాత్రం టిడ్కో ఇళ్లపై చర్చకు డిమాండ్ చేస్తోంది. దీంతో మంత్రులు అనిల్‌ యాదవ్‌, బుగ్గన విపక్షాలపై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు.. టిడ్కో ఇళ్లపై పట్టుబట్టి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. సభాకార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడును ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story