ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు నిమ్మకూరు ముస్తాబు

X
By - Subba Reddy |13 April 2023 11:00 AM IST
ఎన్టీఆర్ జంయతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు నిమ్మకూరు ముస్తాబైంది. ఎన్టీఆర్ జంయతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మచిలీపట్నం పర్యటన తర్వాత నిమ్మకూరు చేరుకున్న చంద్రబాబు రాత్రి అక్కడే బస చేశారు. మరికాసేపట్లో నిమ్మకూరులోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను టీడీపీ శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశాయి. ఆ తర్వాత నిమ్మకూరు వాసులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం కోసం నిమ్మకూరు వాసులు ఎదురు చూస్తున్నారు. ఆత్మీయ సమావేశంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రామకృష్ణ, సుహాసిని నూతన వస్త్రాలను సమర్పించనున్నారు. నిమ్మకూరు పర్యటన తర్వాత చంద్రబాబు గుడివాడ వెళ్తారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com