మూడో విడత ప్యాకేజీతో సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదు : సీపీఐ రామకృష్ణ
By - kasi |14 Nov 2020 11:28 AM GMT
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మూడో విడత ప్యాకేజీతో సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మూడో విడత ప్యాకేజీతో సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల ప్రయోజనం కోసమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారన్నారు. దేశవ్యాప్తంగా చిన్న,సన్నకారు రైతులను మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఇటు ఏపీలో... అమరావతి రాజధాని ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని ఏడాదిగా సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్రానికి తీరని నష్టమన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com