AP: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 చైర్మన్ పదవులను కేటాయించారు. మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి మొత్తం 705 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ పదవుల భర్తీలో జనసేనకు సముచిత స్థానం ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే 62 కార్పొరేషన్ పోస్టులు భర్తీ అయ్యాయి. టీడీపీ 49, జనసేన 10, బీజేపీ 3 చొప్పున పంచుకున్నాయి. ఇంకా 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డ్స్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. మొత్తం 1314 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 60 వేల అప్లికేషన్లు వచ్చాయి. తొలి విడతగా 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవులను ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com