వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన వృద్ధురాలు!

వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన వృద్ధురాలు!
నిజానికి ఈ పట్టాల పంపిణీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. వీటి పంపిణీ కార్యక్రమంలో కొన్ని పదనిసలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలను అందిస్తు్న్నారు. జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిజానికి ఈ పట్టాల పంపిణీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. వీటి పంపిణీ కార్యక్రమంలో కొన్ని పదనిసలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అవి వైసీపీ నేతలకు తీవ్ర అసహనాన్ని తెచ్చిపెడుతున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా అనంతపురం జిల్లాలో చేటుచోసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో నెటిజన్లంతా ఆ ఘటన ఏంటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు.

అసలా ఘటన ఏంటంటే.. అనంతపురం జిల్లా తనకల్లులో.. వైసీపీ నేతలకు షాకిచ్చింది ఓ వృద్ధురాలు. ఇంటి పట్టాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాల్గొన్నారు. ఓ వృద్ధురాలికి ఇంటి పట్టా ఇచ్చిన ఎమ్మెల్యే.. అత్యుత్సాహంతో ఇల్లు ఎవరు ఇస్తున్నారని ఆ వృద్ధురాలిని అడిగారు. వెంటనే స్పందించిన వృద్ధురాలు... చంద్రబాబు ఇచ్చారంటూ సభలో చెప్పడంతో వైసీపీ నేతలతో పాటు అక్కడి అధికారులు అవాక్కయ్యారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.

అటు తాడిపత్రి, యాడికి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ పట్టాలు ఎవరిస్తున్నారని మహిళలను అడిగారు. మహిళలు ఏ మాత్రం తడుముకోకుండా చంద్రబాబు ఇస్తున్నాడంటూ చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా లబ్ధిదారులు చంద్రబాబు నాయుడి జపం చేయడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు!

Tags

Read MoreRead Less
Next Story