ఏపీలో హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు!
By - TV5 Digital Team |1 Jan 2021 11:36 AM GMT
విశాఖ మన్యంలో దుండగులు దుర్మార్గానికి తెగబడ్డారు. పాడేరు ఘాట్లోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం స్పందించిన తర్వాత కూడా రెండు చోట్ల ఇలాంటి ఘటనలే వెలుగు చూడటం హిందూ భక్తుల్లో ఆందోళన పెంచుతోంది. విశాఖ మన్యంలో దుండగులు దుర్మార్గానికి తెగబడ్డారు. పాడేరు ఘాట్లోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అటు రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి చేతులు ధ్వంసం చేసిన ఘటన జరిగిన కొద్ది గంటలకే విశాఖలో ఇలాంటి ఘటనే వెలుగు చూడటం కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో హిందువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దాడులను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దోషులపై సరైన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com