ఉల్లి మళ్లీ ఘాటెక్కింది..
X
By - kasi |18 Oct 2020 1:58 PM IST
ఉల్లి మళ్లీ ఘాటెక్కింది. భారీ వర్షాలకు మహారాష్ట్రలోని పూణె, నాసిక్ ప్రాంతాల్లో ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రాయలసీమ ఉల్లికి ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. కర్నూలు మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 5 వేలకుపైగా పలుకుతోంది. వర్షాలతో నష్టపోయినా... అరకొర దిగుబడులు వచ్చినా... మంచి ధరలు రావడం రైతులకు కాస్త ఊరట కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com