PAWAN: మంచి చేయకపోతే రాజకీయాలు వదిలేస్తా

PAWAN: మంచి చేయకపోతే రాజకీయాలు వదిలేస్తా
X
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ.. మత్స్యకారుల బహిరంగలో సభలో పవన్... ఉప్పాడ-కొణాపాక పనులు ఆరంభం

ఉప్పాడ సీ ప్రొ­టె­క్ష­న్‌ వా­ల్‌ ని­ర్మి­స్తా­న­ని ఏపీ ఉప ము­ఖ్య­మం­త్రి పవ­న్‌­క­ల్యా­ణ్‌ మాట ఇచ్చా­రు. ఇప్ప­టి­కే ఉప్పాడ- కొ­ణ­పాక మధ్య తీర రక్షణ పను­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు చె­ప్పా­రు. పవన్ కల్యా­ణ్ ఉప్పాడ ప్రాం­తా­ని­కి చెం­దిన మత్స్య­కార ప్ర­తి­ని­ధు­లు, అధి­కా­రు­ల­తో ఆయన సమా­వే­శ­మ­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా మత్స్య­కా­రు­ల­తో మా­ట్లా­డిన పవన్ వారి సమ­స్య­ల­ను తె­లు­సు­కు­న్నా­రు. ఉప్పా­డ­లో ని­ర్వ­హిం­చిన మత్స్య­కా­రుల బహి­రంగ సభలో పా­ల్గొ­ని ఆయన మా­ట్లా­డా­రు. ఈ సమా­వే­శం­లో ఉప్పాడ మత్స్య­కా­రుల సమ­స్య­ల­పై చర్చిం­చా­మ­ని పవన్ కల్యా­ణ్ తె­లి­పా­రు. చేపల వే­ట­పై 7 వే­ల­కు పైగా కు­టుం­బా­లు ఆధా­ర­ప­డి ఉన్నా­య­ని, వేట ని­షేధ సమ­యం­లో మత్స్య­కా­రు­ల­కు ఏటా రూ.20 వేలు ఇస్తు­న్నా­మ­ని డి­ప్యూ­టీ సీఎం అన్నా­రు. పరి­శ్ర­మల వ్య­ర్థాల వల్ల మత్స్య సంపద తగ్గి­పో­తోం­ద­నే ఆం­దో­ళన ఉం­ద­న్నా­రు. ఉప్పాడ సీ ప్రొ­టె­క్ష­న్‌ వా­ల్‌ ని­ర్మా­ణం­పై ఈనెల 14న సమా­వే­శం ని­ర్వ­హి­స్తా­మ­ని, అలా­నే ఉప్పాడ సీ ప్రొ­టె­క్ష­న్‌ వా­ల్‌ ని­ర్మి­స్తా­మ­ని మత్స్య­కా­రు­ల­కు పవ­న్‌ కల్యా­ణ్‌ హామీ ఇచ్చా­రు. రూ.323 కో­ట్ల­తో ఉప్పాడ సీ ప్రొ­టె­క్ష­న్‌ వా­ల్‌ ని­ర్మిం­చేం­దు­కు కేం­ద్రం సా­ను­కూ­లం­గా ఉం­ద­ని ఉప ము­ఖ్య­మం­త్రి పవ­న్‌­క­ల్యా­ణ్‌ తె­లి­పా­రు.

పవన్ కీలక వ్యాఖ్యలు

‘‘పరి­శ్ర­మ­ల­కు వ్య­తి­రే­కం కా­ద­ని మత్స్య­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. పరి­శ్ర­మల వ్య­ర్థాల వల్ల మత్స్య­సం­పద తగ్గి­పో­తుం­ద­ని ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు. వ్య­ర్థా­ల­ను శు­ద్ధి చే­య­కుం­డా వద­ల­డం వల్ల మత్స్య­సం­పద దె­బ్బ­తిం­టుం­ది. పరి­శ్ర­మల వ్య­ర్థాల వ్య­వ­హా­రం­లో మత్స్య­కా­రు­లు ఎక్క­డి­కి చె­బి­తే అక్క­డి­కి వస్తా. వ్య­ర్థా­లు ఎక్కడ కలు­స్తు­న్నా­యో.. అక్క­డి­కే బో­టు­లో వె­ళ్తా. 100 రో­జు­లు సమయం ఇస్తే.. కా­లు­ష్యం తగ్గిం­పు­పై ప్ర­ణా­ళిక రూ­పొం­ది­స్తాం. ప్ర­జ­ల­ను వం­చిం­చా­ల­ని నాకు లేదు. ప్ర­జ­ల­కు న్యా­యం చే­య­లే­న­ప్పు­డు రా­జ­కీ­యా­లు వది­లే­సి వె­ళ్లి­పో­తా. ' రూ.323 కో­ట్ల­తో సీ ప్రొ­టె­క్ష­న్‌ వా­ల్‌ ని­ర్మా­ణా­ని­కి కేం­ద్రం సా­ను­కూ­లం ఉంది. ఉప్పాడ-కొ­ణ­పాక మధ్య తీ­ర­ర­క్షణ పను­లు ప్రా­రం­భిం­చాం. పరి­శ్ర­మల వ్య­ర్థాల శు­ద్ధి­పై మూడు వి­డ­త­ల్లో పరి­శీ­లి­స్తాం. మత్స్య­కా­రు­లు ఎక్క­డి­కి చె­బి­తే అక్క­డి­కి మూ­డ్రో­జు­ల్లో వస్తా­ను. వ్య­ర్థా­లు ఎక్కడ కలు­స్తు­న్నా­యో.. అక్క­డి­కే బో­టు­లో వె­ళ్తా­ను. ప్ర­జ­ల­ను వం­చిం­చా­ల­ని ఎప్పు­డూ ఉం­డ­దు.’’ అని పవ­న్‌ అన్నా­రు.

Tags

Next Story