PAWAN KALYAN: లౌకిక వాదం ముసుగులో హిందూమతంపై దాడి

PAWAN KALYAN: లౌకిక వాదం ముసుగులో హిందూమతంపై దాడి
X
మురుగ భక్తర్గల్ మానాడులో పాల్గొన్న పవన్.. ధర్మరక్షణకు ఐక్యంగా పోరాడదామని పిలుపు

ఎక్కడ ధర్మం దారి తప్పి­తే అక్క­డే పో­రా­టం ఉం­టుం­ద­ని ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అన్నా­రు. కా­వా­ల­నే ఉత్త­రా­ది­తో పో­లు­స్తూ సమ­స్య­ను పక్క­దా­రి పట్టిం­చ­డ­మే కాదు.. ప్ర­జ­ల్లో వి­భ­జ­న­వా­దం తీ­సు­కు­రా­వా­ల­నే కు­ట్ర దాగి ఉం­ద­న్నా­రు. ఇలాం­టి వి­భ­జన ఆలో­చ­న­లు ఉన్న­వా­రు చాలా ప్ర­మా­దం. ఇలాం­టి వారు శి­వు­ని­పై, అమ్మ­వా­రి­పై కూడా ప్ర­శ్న­లు వే­స్తా­ర­న్నా­రు. దే­శం­లో ఎక్కడ ధర్మం దారి తప్పి­నా అక్కడ సం­ఘ­టి­తం­గా పో­రా­డ­టం కచ్చి­తం­గా చే­యా­ల్సిన పని అన్నా­రు.

తమి­ళ­నా­డు­లో­ని మధు­రై­లో జరి­గిన ము­రుగ భక్త­ర్గ­ల్ మా­నా­డు­లో ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ పా­ల్గొ­న్నా­రు. ము­రు­గ­న్ భక్తు­డి­గా పవన్ కళ్యా­ణ్ నడు­చు­కు­న్న తీరు అక్క­డి వా­రి­ని ఆక­ట్టు­కుం­ది. ఆది­వా­రం ని­ర్వ­హిం­చిన ఈ మా­నా­డు­లో పవన్ కల్యా­ణ్ కీలక ప్ర­సం­గం చే­శా­రు. 'ధ­ర్మం అంటే ఏంటి? దు­ష్ట శక్తు­ల­ను తొ­ల­గిం­చ­డం ధర్మం. ప్ర­తి­వా­రి­నీ సమా­నం­గా చూ­డ­టం ధర్మం. దు­ష్టు­ల­ను శి­క్షిం­చ­డం ధర్మం' అని జన­సేన పా­ర్టీ అధి­నేత, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ అన్నా­రు. 'నే­ను పద­హా­రు ఏటే శబ­రి­మల వె­ళ్లి­న­వా­ణ్ణి. థై­పూ­సం సం­ద­ర్భం­గా తి­రు­త్త­ణి­కి భక్తుల పో­టు­ను చూశా. వి­భూ­తి పె­ట్టు­కొ­ని స్కూ­ల్‌­కి వె­ళ్లి­న­వా­డి­ని' అని తన బా­ల్యా­న్ని గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. 'ఒక క్రై­స్త­వు­డు తన మతా­న్ని గౌ­ర­విం­చ­వ­చ్చు. ఒక ము­స్లిం కూడా వారి మతా­న్ని గౌ­ర­విం­చ­వ­చ్చు. కానీ హిం­దు­వు తన మతా­న్ని గౌ­ర­వి­స్తే మా­త్రం అభ్యం­త­రం?' అని తె­లి­పా­రు. 'హిం­దు ధర్మా­న్ని, హిం­దూ దే­వ­త­ల­ను చు­ల­కన చే­స్తా­రు. వా­రి­ది సె­క్యు­ల­రి­జం కాదు సూడో సె­క్యు­ల­రి­జం' అని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. సనా­తన ధర్మం పే­రిట తమి­ళ­నా­డు­లో సరి­కొ­త్త రా­జ­కీ­యం మొ­ద­లు­పె­ట్టిన పవ­న్‌ కల్యా­ణ్‌ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. నా­స్తి­కు­ల­ను తప్పు­బ­ట్టా­రు. ధర్మం­పై కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఈ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక సభ అనిపించుకున్నప్పటికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయంగా స్పష్టమైన సంకేతాలివ్వడం విశేషం. తమిళనాడులో హిందూ సంప్రదాయాల రక్షణను, హిందూ మతంపై పెరుగుతున్న విపరీత ధోరణులను ఎత్తి చూపుతూ – ధర్మం, సంస్కృతి, భక్తి అనే మాటలతో ఆయన మాట్లాడిన తీరు రాజకీయ స్థాయిలో పలు అర్థాలను కలిగిస్తోంది.

పవన్ వ్యూహాత్మక అడుగులు

ఈ సభ పవన్ కళ్యా­ణ్‌­కు ద్వం­ద్వ ప్ర­యో­జ­నం కలి­గిం­చిం­ద­నే చె­ప్పా­లి. ఒక­వై­పు భక్తి భా­వ­న­తో తన వ్య­క్తి­త్వా­న్ని ప్ర­జ­ల­కు దగ్గర చే­య­డం, మరో­వై­పు "సూడో సె­క్యు­ల­రి­జం" అనే వి­మ­ర్శ­ల­తో హిం­దు­త్వ భా­వ­జా­లా­న్ని ప్రో­త్స­హిం­చ­డ­మూ ఉంది. "హిం­దు­వు­గా మతా­న్ని గౌ­ర­విం­చ­ట­మే తప్పు­గా మలి­చే వా­రి­పై గట్టి వి­మ­ర్శ" ద్వా­రా పవన్ తన బే­స్‌­ను బలో­పే­తం చే­యా­ల­ను­కుం­టు­న్న­ట్లు కని­పి­స్తోం­ది. తమి­ళ­నా­డు­లో బల­ప­డా­ల­న్న లక్ష్యం­తో­నే పవన్ ఇలా ఒక "ఆధ్యా­త్మిక-రా­జ­కీయ పటి­ష్టత" ప్ర­ద­ర్శిం­చా­రా అన్న అను­మా­నా­లు రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. "ఏథె­న్స్ కంటే ప్రా­చీ­న­మైన మధు­రై­లో మా­ట్లా­డే అవ­కా­శం రా­వ­డం" అనే వ్యా­ఖ్య­తో ఆయన తన భా­వో­ద్వే­గా­న్ని ప్ర­జ­ల­తో పం­చు­కు­న్నా­రు. దాని వె­నుక రా­జ­కీయ ప్ర­యో­జ­నాల కోసం తమిళ హిం­దు­వుల మన్న­న­లు పొం­దా­ల­న్న తపన స్ప­ష్టం­గా కని­పి­స్తుం­ది.

దక్షిణాదిన పార్టీ విస్తరణ

ఈ సభ పవన్ కళ్యా­ణ్‌­కు ద్వం­ద్వ ప్ర­యో­జ­నం కలి­గిం­చిం­ద­నే చె­ప్పా­లి.జన­సేన ఇప్ప­టి­వ­ర­కు ప్ర­ధా­నం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పరి­మి­త­మైన పా­ర్టీ­గా ఉన్నా, పవన్ చే­సిన ఈ వి­ధ­మైన ప్ర­సం­గం ద్వా­రా సు­దీ­ర్ఘం­గా దక్షిణ భా­ర­తం­లో పా­ర్టీ­ని వి­స్త­రిం­చా­ల­నే సం­క­ల్పా­న్ని చూ­పిం­చా­ర­ని వి­శ్లే­ష­కుల అభి­ప్రా­యం. హిం­దు­త్వం­పై పట్టు­సా­ధిం­చా­ల­న్న బీ­జే­పీ ధో­ర­ణి­ని అను­స­రిం­చ­డ­మే కాక, దా­ని­కి తోడు పవన్ తన స్వంత మా­ర్క్‌­ను కూడా వేసే ప్ర­య­త్నం చే­శా­రు. ఈ కా­ర్య­క్ర­మం పవన్ కళ్యా­ణ్‌­కు రా­జ­కీ­యం­గా మూడు ది­శ­ల­లో ఉప­యో­గ­ప­డే అవ­కా­శ­ముం­ది. హిం­దూ మత పరి­ర­క్షణ కంటే ముం­దు­కె­ళ్లి – హిం­దు­త్వ భా­వ­న­లో పు­నా­దు­లు వేసే ప్ర­య­త్నం కా­వ­చ్చు.

Tags

Next Story