ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
By - Nagesh Swarna |10 March 2021 4:02 AM GMT
పవన్ ఓటు వేయడానికి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్న అభిమానులు.. భారీ సంఖ్యలో చేరుకున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ పటమటలంకలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ ఓటు వేయడానికి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్న అభిమానులు.. భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com