PAWAN: పవన్‌ వార్నింగ్‌తో వైసీపీలో కలకలం

PAWAN: పవన్‌ వార్నింగ్‌తో వైసీపీలో కలకలం
X
గీత దాటితే చేతి గీతలు చెరిపేస్తా జాగ్రత్త... రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు.. వైఎస్ అధినేత జగన్ కు పవన్ వార్నింగ్

వైసీపీ నేతల విమర్శలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏకంగా జగన్‌ను టార్గెట్‌ చేసి పవన్ చేసిన విమర్శలు.. వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ కౌం­ట­ర్

మె­డి­క­ల్ కా­లే­జీ­లు పీ­పీ­పీ వి­ధా­నం­లో తీ­సు­కు­న్న వా­రి­ని జై­ల్లో­కి పం­పి­స్తా­మ­ని వై­సీ­పీ అధి­నేత జగన్ చే­సిన కా­మెం­ట్స్‌­కు డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ కౌం­ట­ర్ ఇచ్చా­రు. తా­డే­ప­ల్లి­గూ­డెం­లో­ని పె­ర­వ­లి­లో పర్య­టి­స్తు­న్న పవన్ కల్యా­ణ్‌ అక్కడ పలు అభి­వృ­ద్ధి పను­ల­కు శ్రీ­కా­రం చు­ట్టా­రు. అక్క­డే అమ­ర­జీ­వి జల­ధార పథ­కా­ని­కి శం­కు­స్థా­పన చే­శా­రు. ప్ర­జ­ల­కు తా­గు­నీ­రు అం­దిం­చా­ల­నే ఉద్దే­శం 7,910 కో­ట్లు ఖర్చు పె­ట్టి ఈ పథ­కా­ని­కి ప్ర­భు­త్వం శ్రీ­కా­రం చు­ట్టిం­ది. అమ­ర­జీ­వి జల­ధార కా­ర్య­క్ర­మా­ని­కి శం­కు­స్థా­పన చే­సిన తర్వాత అక్క­డే ఏర్పా­టు చే­సిన బహి­రంగ సభలో మా­ట్లా­డా­రు. ఈ సం­ద­ర్భం­గా తన వచ్చిన వి­మ­ర్శ­లు ఇప్పు­డు వై­సీ­పీ నే­త­లు చే­స్తు­న్న ఆరో­ప­ణ­ల­పై స్పం­దిం­చా­రు. ఎన్నో కష్టా­లు ఎదు­రు­దె­బ్బ­లు తిని పా­ర్టీ­ని పదే­ళ్లు­గా నడు­పు­తూ వచ్చా­న­ని అన్నా­రు. ప్ర­జల కోసం చాలా తగ్గి­న­ట్టు చె­ప్పా­రు. దీ­న్ని అర్థం చే­సు­కో­లే­ని వా­ళ్లు తాను టి­కె­ట్లు అమ్ము­కు­న్న­ట్టు, డబ్బు­ల­కు లొం­గి­పో­యి­న­ట్టు వి­మ­ర్శ­లు చే­శా­ర­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. కానీ పొ­ట్టి శ్రీ­రా­ము­లు లాం­టి వ్య­క్తి­ని ఆద­ర్శం­గా తీ­సు­కొ­ని ఓ వ్య­క్తి ప్ర­యా­ణం చే­స్తు­న్నా­డం­టే, దే­శ­మం­టే, ప్ర­జ­లం­టే ఎంత పి­చ్చి ఉం­డా­ల­ని అన్నా­రు. అలాం­టి వ్య­క్తి­ని అర్థం చే­సు­కో­వ­డం అంత ఈజీ కా­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. ప్ర­జ­లు ఇం­త­లా తీ­ర్పు ఇచ్చి­నా కొం­ద­రి­కి బు­ద్ది రా­లే­ద­ని పవన్ ఫైర్ అయ్యా­రు. ఇంకా రా­ష్ట్రం­లో రౌ­డీ­యి­జం చే­స్తు­న్నా­ర­ని వై­సీ­పీ నే­త­ల­పై మం­డి­ప­డ్డా­రు. ఇలాం­టి వాటి ఆట కట్టిం­చేం­దు­కు తమకు రెం­డు రో­జుల సమయం చా­ల­ని అన్నా­రు.

రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు

బూ­ర్గుల రా­మ­కృ­ష్ణా­రా­వు, పొ­ట్టి శ్రీ­రా­ము­లు ఎప్పు­డూ తన గుం­డె­ల్లో ఉం­టా­ర­ని పవ­న్‌ క అన్నా­రు. ‘‘ప్రా­జె­క్టు ఎం­దు­కు ఆల­స్య­మ­వు­తుం­దం­టూ వై­కా­పా నే­త­లు ఆరో­ప­ణ­లు చే­స్తు­న్నా­రు. వై­కా­పా అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డూ బె­ది­రిం­పు­ల­కు భయ­ప­డ­లే­దు. దౌ­ర్జ­న్యా­ల­కు ది­గు­తూ మళ్లీ వస్తా­మం­టూ ది­గ­జా­రి మా­ట్లా­డు­తు­న్నా­రు. రెం­డు రో­జు­లు కి­రా­యి గూం­డా­లు, రౌ­డీల వి­వ­రా­లు ఆరా తీ­స్తే పరి­స్థి­తి తె­లు­స్తుం­ది. రౌ­డీ­ల­పై రా­జ­కీయ ని­ర్ణ­యం తీ­సు­కుం­టే మళ్లీ ఇలాం­టి మా­ట­లు రావు. ఆరో­ప­ణ­లు చే­సే­వా­రి­ని హె­చ్చ­రి­స్తు­న్నా.. రా­జ­కీయ ని­ర్ణ­యం వరకూ తీ­సు­కె­ళ్లొ­ద్దు. అధి­కా­రం ఉన్నా.. లే­క­పో­యి­నా.. పవ­న్‌ ఎప్పు­డూ పవ­న్‌­లా­నే ఉం­టా­డు. వై­కా­పా రౌ­డీ­ల­కు యోగి ఆది­త్య­నా­థ్‌ వంటి ట్రీ­ట్‌­మెం­ట్‌ ఇవ్వా­లి’’ అని పవ­న్‌ కల్యా­ణ్‌ మం­డి­ప­డ్డా­రు. ఎన్ని వి­మ­ర్శ­లై­నా ఎదు­ర్కొ­నేం­దు­కు సమా­ధా­నం చె­ప్పేం­దు­కు సి­ద్ధ­మ­ని పవన్ తె­లి­పా­రు. కానీ ప్ర­తి దా­న­కి ఓ లి­మి­ట్ ఉం­టుం­ద­ని, అలాం­టి వా­రి­కి గట్టి ట్రీ­ట్మెం­ట్ ఇస్తా­మ­ని తె­లి­పా­రు. అడ్డ­గో­లు­గా ఏది పడి­తే అది చే­స్తా­మం­టే మా­త్రం ఊరు­కు­నే­ది లే­ద­న్నా­రు. తాజాగా ప్రారంభించిన అమరజీవి జలధార ఐదు జిల్లాల ప్రజలకు మేలు చేస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Tags

Next Story