PAYYAVULA: ఆర్థికమంత్రితో పయ్యావుల భేటీ

పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని **నిర్మలా సీతారామన్**ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్, ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి తగిన స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నదుల అనుసంధానం ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని, దీంతో వ్యవసాయం, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైన లాభం చేకూరుతుందని ఆయన వివరించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రెవెన్యూ గ్రాంట్లను అత్యధిక స్థాయిలో మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సాస్కీ (SASKI), పూర్వోదయ వంటి కేంద్ర పథకాల కింద కూడా ఆంధ్రప్రదేశ్కు తగిన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతున్న **విశాఖపట్నం**ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, పోర్ట్ ఆధారిత అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన వివరించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

